టాప్ లఘు చిత్రాలతో పోటీపడి లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ కు ఎంపికైన ‘షేమ్ లెస్’..

|

Nov 30, 2020 | 6:24 PM

లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో సయాని గుప్తా- హుస్సేన్ దలాల్- రిషబ్ కపూర్ నటించిన లఘు చిత్రం`షేమ్ లెస్` ఆస్కార్ 2021 కు భారత్ నుంచి అధికారికంగా ఖాయమైందని తెలుస్తుంది.

టాప్ లఘు చిత్రాలతో పోటీపడి లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ కు ఎంపికైన షేమ్ లెస్..
Follow us on

లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో సయాని గుప్తా- హుస్సేన్ దలాల్- రిషబ్ కపూర్ నటించిన లఘు చిత్రం`షేమ్ లెస్` ఆస్కార్ 2021 కు భారత్ నుంచి అధికారికంగా ఖాయమైందని తెలుస్తుంది. ‘షేమ్ లెస్’ లఘు చిత్రం గత ఏడాది ఏప్రిల్ లో విడుదలైంది. కీత్ గోమ్స్ దర్శకత్వంలో ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కింది.

ఈ లఘు చిత్రం ఆస్కార్ కు ఎంపిక అవ్వడం పై కీత్ గోమ్స్ ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబసభ్యులనుంచి, స్నేహితులనుంచి తీసుకున్న కొద్దిపాటి డబ్బులతోనే ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కించానని, ఈ చిత్రం కోసం ప్రతి ఒక్కరూ చాలా ప్రేమపూర్వకంగా పనిచేశారని కీత్ గోమ్స్ ఎమోషనల్ అయ్యారు. ఇక ‘షేమ్ లెస్’ చిత్రం షాన్ వ్యాస్`నాట్ కథ్`,ఆదిత్య కెల్గావ్కర్ `సౌండ్ ప్రూఫ్`, సఫర్ .. ట్రాప్డ్ లాంటి టాప్ లఘు చిత్రాలతో పోటీపడి ఆస్కార్ కు ఎంపికైంది.