చిరుతో శ్రీదేవి మూవీకి బ్రేక్: యండమూరి

| Edited By:

Apr 26, 2019 | 5:07 PM

హీరోయిన్‌గా పలు భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించిన అతిలోక సుందరి శ్రీదేవి, మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాను నిర్మించాలనుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ అటకెక్కింది. దీనికి గల కారణాన్ని ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చిరంజీవితో శ్రీదేవి నిర్మించాలనుకున్న సినిమాకు కోదండరామి రెడ్డి దర్శకుడిగా ఫైనల్ అయ్యారు. అంతేకాదు ఈ మూవీకి సంబంధించిన ఒక పాట చిత్రీకరణ కూడా పూర్తైంది. అయితే […]

చిరుతో శ్రీదేవి మూవీకి బ్రేక్: యండమూరి
Follow us on

హీరోయిన్‌గా పలు భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించిన అతిలోక సుందరి శ్రీదేవి, మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాను నిర్మించాలనుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ అటకెక్కింది. దీనికి గల కారణాన్ని ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

చిరంజీవితో శ్రీదేవి నిర్మించాలనుకున్న సినిమాకు కోదండరామి రెడ్డి దర్శకుడిగా ఫైనల్ అయ్యారు. అంతేకాదు ఈ మూవీకి సంబంధించిన ఒక పాట చిత్రీకరణ కూడా పూర్తైంది. అయితే కథ ఫైనలైజ్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ అక్కడితో ఆగిపోయిందట. ఆ తరువాతనే ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా వచ్చిందని యండమూరి తెలిపారు. ఇక శ్రీదేవి సినిమాలైన ‘ఆఖరి పోరాటం’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘ఒక రాధ.. ఇద్దరు కృష్ణులు’ వంటి చిత్రాలకు తాను పనిచేశానని.. ఒకటి, రెండు సార్లు ఆమెతో మాట్లాడటమే గానీ, అంతకు మించి పరిచయం లేదని యండమూరి గుర్తుచేసుకున్నారు.