షాక్ ఇవ్వనున్న ప్రభాస్.. రెడీ అవుతున్న యంగ్ హీరోలు

| Edited By: Srinu

Jul 17, 2019 | 1:01 PM

బాహుబలి 2 విడుదలై రెండేళ్లు పూర్తవుతోంది. ఈ మూవీ తరువాత మాట్లాడిన ప్రభాస్.. ఇకపై సంవత్సరానికి రెండు సినిమాలతో మీ ముందుకు వస్తానని అభిమానులకు మాటిచ్చాడు. రెండు సినిమాల సంగతేంటో కానీ.. ఈ రెండు సంవత్సరాలలో ఆయన నటించిన ఒక్క మూవీ కూడా విడుదల కాలేదు. అయితే ఈ ఏడాది స్వాతంత్ర్యదినోత్సం రోజున ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకు వస్తానని ఆయన మరోమారు మాటిచ్చాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ ఎదురుచూపులు చూడటం మొదలుపెట్టారు. మరోవైపు ఈ మాట […]

షాక్ ఇవ్వనున్న ప్రభాస్.. రెడీ అవుతున్న యంగ్ హీరోలు
Follow us on

బాహుబలి 2 విడుదలై రెండేళ్లు పూర్తవుతోంది. ఈ మూవీ తరువాత మాట్లాడిన ప్రభాస్.. ఇకపై సంవత్సరానికి రెండు సినిమాలతో మీ ముందుకు వస్తానని అభిమానులకు మాటిచ్చాడు. రెండు సినిమాల సంగతేంటో కానీ.. ఈ రెండు సంవత్సరాలలో ఆయన నటించిన ఒక్క మూవీ కూడా విడుదల కాలేదు. అయితే ఈ ఏడాది స్వాతంత్ర్యదినోత్సం రోజున ‘సాహో’తో ప్రేక్షకుల ముందుకు వస్తానని ఆయన మరోమారు మాటిచ్చాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ ఎదురుచూపులు చూడటం మొదలుపెట్టారు. మరోవైపు ఈ మాట కోసం ఆయన కూడా చాలా కష్టపడి షూటింగ్‌ను పూర్తి చేశాడు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం వల్ల ఈ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడనున్నదని తెలుస్తోంది.

ఫిలింనగర్‌లో తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఆగష్టు 30కు వాయిదా పడనుందని టాక్. యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యేందుకు ఇంకా సమయం పడుతుందని.. అందుకే 15రోజులు విడుదలను వాయిదా వేయాలని నిర్మాతలు అనుకుంటున్నారట.

ఇదిలా ఉంటే ‘సాహో’ విడుదల వాయిదా విషయం ఇండస్ట్రీలో అప్పుడే కొందరు నిర్మాతలకు తెలిసిందట. దీంతో తమ తమ సినిమాలను ఆగష్టు 15న విడుదల చేయాలనుకుంటున్నారట. ఇందులో భాగంగానే శర్వానంద్ ‘రణరంగం’, అడివి శేషు ‘ఎవరు’ చిత్రాలకు తాజాగా ఆగష్టు 15న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారని సమాచారం. మరి ఇందులో నిజమెంత..? సాహో విడుదల మళ్లీ వాయిదా పడనుందా..? అని విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.