Pawan Krish Movie: క్రిష్ మూవీలో కుస్తీ వీరులతో పోరాటానికి సిద్ధమైన రాబిన్ హుడ్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్

|

Feb 24, 2021 | 8:39 AM

పవర్ స్టార్ పవన్ కళ్యణ్ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. తాజాగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ..

Pawan Krish Movie: క్రిష్ మూవీలో కుస్తీ వీరులతో పోరాటానికి సిద్ధమైన రాబిన్ హుడ్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్
Follow us on

Pawan Krish Movie:  పవర్ స్టార్ పవన్ కళ్యణ్ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. తాజాగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.. అదే పవన్ కళ్యాణ్ కండలు తిరిగిన మల్లయోధులతో తలపడబోతున్నాడట.. ఇందుకు ఫొటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత కెరీర్ ఎన్నడూ లేనంత స్పీడ్ గా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. వీటిల్లో అత్యంత క్యూరియాసిటీని రేకెత్తిస్తున్న సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ మూవీ 15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. ప్రతీ విషయం స్పెషల్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది.

ఈ పీరియాడికల్ డ్రామాలో.. పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ పరిశీలిస్తున్న విషయం కూడా తెలిసిందే. అంతేకాదు.. పవన్ గెటప్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న క్రిష్‌.. అద్భుతమైన రూపాన్ని ఫైనల్ చేశాడట. త్వరలోనే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఇతర భాషల నటీనటులను తీసుకున్నారు. పవన్ సరసన.. నిధి అగర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు.

చారిత్రక పరిస్థితులను కళ్లకు కట్టేందుకు చార్మినార్ తోపాటు గండికోట సంస్థానం సెట్ ను కూడా నిర్మిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ నడుస్తోంది. పవన్ పది రోజులు డేట్స్ కేటాయించడంతో.. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు పూర్తిచేయబోతున్నాడు క్రిష్‌. ఇందులో భాగంగా.. భారీ దేహాలు కలిగిన మల్లయోధులతో వీరోచిత పోరాటాన్ని షూట్ చేయబోతున్నడు దర్శకుడు. ప్రస్తుతం ఆ పహిల్వాన్లతో కలిసి పవన్ కల్యాణ్ దిగిన ఫొటో సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పవన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవబోతున్న ఈ మూవీని.. ప్రముఖ నిర్మాత ఏ.ఎమ్ రత్నందాదాపు 170 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారట. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను బరిలో నిలపాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.

Also Read:

నిఖిల్‌తో ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తోన్న అందాల అనుపమ.. హిట్‌ సినిమా సీక్వెల్‌లో..