Cinema : ఇదెక్కడి సినిమా భయ్యా.. రూ.32 కోట్లతో తీస్తే రూ.450 కోట్ల కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..

రూ.32 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటికీ ఓటీటీలో దూసుకుపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరెంటో తెలుసా.. ?

Cinema : ఇదెక్కడి సినిమా భయ్యా.. రూ.32 కోట్లతో తీస్తే రూ.450 కోట్ల కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
Andhadhun Movie

Updated on: Feb 20, 2026 | 5:40 PM

కొన్ని సినిమాలు చాలా కాలంపాటు సినీప్రియుల హృదయాల్లో నిలిచిపోతాయి. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన చిన్న చిత్రాలు ఊహించని విజయాన్ని అందుకుంటాయి. ఇక అవే సినిమాలు అటు ఓటీటీ ప్రపంచంలోనూ సత్తా చాటుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ సైతం అలాంటిదే. ఈ సినిమా దాని ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే, మధ్యలో ఊహించలేని మలుపు, ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ కారణంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులోనూ రీమేక్ చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అది ఏ సినిమానో మీకు తెలుసా? ఆ సినిమా పేరు అంధాధున్.

అంధాధున్.. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. 2018లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ప్రధాన పాత్రలు పోషించారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందించగా.. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ నిర్మించింది. రూ. 32 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 450 కోట్లకు పైగా వసూలు చేసి మంచి ఆదరణ పొందింది. ఇదే చిత్రాన్ని తెలుగులో మాస్ట్రో పేరుతో రీమేక్ చేశారు. అందులో నితిన్, తమన్నా నటించారు. అయితే ఈ మూవీ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

హిందీలో మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలో అత్యుత్తమ నటనకు గానూ ఆయుష్మాన్ ఖురానాకు జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది.

Follow Us