Mr. & Mrs. Mahi OTT: ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా.. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

|

Jul 27, 2024 | 6:34 AM

ఈ సినిమా కంటే ముందు జాన్వీ కపూర్ నటించిన చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహీ. ఇందులో బీటౌన్ హీరో రాజ్ కుమార్ రావ్ హీరోగా నటించగా.. క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది మే31 అడియన్స్ ముందుకు వచ్చింది.

Mr. & Mrs. Mahi OTT: ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా.. మిస్టర్ అండ్ మిసెస్ మహీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Mr. & Mrs. Mahi
Follow us on

ధడక్ సినిమాతో హీరోయిన్‏గా సినీరంగంలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఉలఝ్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా కంటే ముందు జాన్వీ కపూర్ నటించిన చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహీ. ఇందులో బీటౌన్ హీరో రాజ్ కుమార్ రావ్ హీరోగా నటించగా.. క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది మే31 అడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి రోజే పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమాలో మరోసారి తనదైన నటనతో అలరించింది జాన్వీ. థియేటర్లలో మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో జూలై 26 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రస్తుతం హిందీలో ఈ సినిమా అందుబాటులో ఉండగా.. తెలుగులోకి వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేయగా.. ప్రస్తుతం ఓటీటీలోనూ అదొక్క భాషలోనూ అందుబాటులోకి వచ్చింది. డైరెక్టర్ శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావ్ జోడి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

క్రికెట్ అంటే చాలా ఫ్యాషన్ ఉండే భార్యభర్తల స్టోరీతో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. భార్యను మంచి క్రికెటర్ చేయాలని భర్త కష్టపడడం.. ఆ తర్వాత వారిద్దరి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది సినిమా. ఇందులో జాన్వీ, రాజ్ కుమార్ రావుతోపాటు రాజేశ్ శర్మ, కుముంద్ మిశ్రా, పూర్ణేందు భట్టాచార్య, జరీనా వాహబ్, అర్జి్త్ తనేజా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై కరణ్ జోహార్, హిరూ యశ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించగా.. ఈ చిత్రానికి ఆరుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.