
తమిళ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. సంక్రాంతి పండక్కి తమిళంలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది. ఓవైపు శివకార్తికేయన్ నటించిన అయాలన్ గట్టిపోటీనిస్తున్న దాదాపు వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి విజేతగా నిలిచింది. అయితే అప్పటికే తెలుగులో వరుస సినిమాలు రిలీజ్ కావడంతో ఇక్కడ పండక్కి విడుదల కాలేదు. రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. ఇక ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఫిబ్రవరి 9 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఒకేరోజు స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక రూ. 45 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో ధనుష్ మరోసారి తన సహజ నటనతో మెప్పించారు. అయితే ఈ మూవీ కంటెంట్ తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో పర్వా్లేదనిపించుకుంది. ఇక్కడ కేవలం కోటి వరకు మాత్రమే రాబట్టింది. ఇక ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..
కెప్టెన్ మిల్లర్ సినిమాలో అగ్నీశ్వర అలియాస్ అగ్ని పాత్రలో ధనుష్ నటించాడు. ఊరిలో కులవివక్షను భరించలేక బ్రిటీష్ ఆర్మీలో సైనికుడిగా చేరిన అగ్ని అక్కడి నుంచి పారిపోయి ఎందుకు దొంగగా మారాడు ?.. అగ్నిని చంపాలని బ్రిటీష్ సైన్యం ఎందుకు ప్రయత్నించింది ?.. అనేది ఈసినిమా.
3 years of sweat, blood and sacrifice from my team to you all. Captain Miller from today 🙏🏻🙏🏻. OM NAMASHIVAYAA ♥️♥️ pic.twitter.com/OtIoE3Dgtv
— Dhanush (@dhanushkraja) January 11, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.