
ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ జానర్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. తాజాగా ఒక సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమాలో హీరో ఫ్యామిలీని చూసి ఆశ్చర్యపోతున్నారు అడియన్స్. అదే బ్లాస్ట్. కన్నడ యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో నటించారు. తొలిసారిగా దర్శకత్వం వహించిన సుభాష్ కె రాజ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీ మే 28న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. థియేటర్లలో ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అభిరామి, ప్రీతి ముకుందన్ కీలకపాత్రలు పోషించారు. ‘KGF’ చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని AGS ఎంటర్టైన్మెంట్ నిర్మించగా.. యాక్షన్ కథాంశంతో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతుంది.
రూ. 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరో రాజారామ్ (అర్జున్) ఒక సాధారణ కరాటే ఇన్స్ట్రక్టర్. తన భార్య (అభిరామి), కూతురు (ప్రీతి ముకుందన్) లతో కలిసి ఒక మిడిల్ క్లాస్ జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే వీరి జీవితాల్లోకి ఒక పవర్ ఫుల్ కార్పొరేట్ మాఫియా ఎంటర్ అవుతుంది. దీంతో వారి జీవితాల్లో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చాయి.. వాటిని ఆ ఫ్యామిలీ ఎలా ఎదుర్కొంది అనేది చిత్రం. ప్రేక్షకులకు ఈ మూవీ ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా అమ్మాయి జీవితంలో ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అత్యధిక వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతుంది. ఇందులో ఎప్పటిలాగే అర్జున్ సర్జా తన మార్క్ యాక్షన్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో మెప్పించగా, అభిరామి తన నటనతో మెప్పించింది. అయితే వీళ్లిద్దరి కంటే హీరోయిన్ ప్రీతి ముకుందన్ నటనకు అడియన్స్ ఫిదా అవుతున్నారు. ఎమోషనల్ అండ్ చాలెంజింగ్ రోల్లో ఆమె చూపించిన హావభావాలు, యాక్టింగ్, అలాగే యాక్షన్ సీన్లలో ఆమె పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయని ప్రశంసలు కురిపిస్తున్నారు.