ప్రభాస్ ‘ఆదిపురుష్’ షూటింగ్‌పై దర్శకుడు క్లారిటీ

| Edited By:

Aug 25, 2020 | 4:24 PM

రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. రామాయణం కథాంశంతో బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారు

ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్‌పై దర్శకుడు క్లారిటీ
Follow us on

Prabhas Adipurush movie: రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. రామాయణం కథాంశంతో బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో 3డీలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే  ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అన్న ప్రశ్న అందరిలో మెదులుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌పై దర్శకుడు ఓమ్ రౌత్ క్లారిటీ ఇచ్చారు.

వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళుతుందని ఓమ్ రౌత్ అన్నారు. ఇక ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఎక్కువగా ఉండటంతో.. వీలైనంత త్వరగా చిత్రీకరణను పూర్తి చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో డేట్లకు సంబంధించి ప్రభాస్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఆదిపురుష్ మూవీ నేపథ్యంలో నాగ్ అశ్విన్‌తో తెరకెక్కించే సినిమా ఆలస్యం కానుందని సమాచారం.

Read More:

టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీస్ శాఖకు అవార్డుల పంట.. ఏకంగా

అలా చేశారో కఠిన చర్యలు తప్పవు.. ఆసుపత్రులకు జగన్‌ హెచ్చరిక