Mahesh Babu: ఘట్టమనేని వారింట చవితి వేడుకలు ఎంత సంబురంగా జరిగాయో చూశారా.. వీడియో షేర్‌ చేసిన నమ్రతా.

|

Sep 14, 2021 | 7:49 PM

Mahesh Babu: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీ కుటుంబాల్లో ఘట్టమనేని ఫ్యామిలీ సభ్యులు ముందు వరుసలో ఉంటారని చెప్పాలి. నమ్రతతో పాటు...

Mahesh Babu: ఘట్టమనేని వారింట చవితి వేడుకలు ఎంత సంబురంగా జరిగాయో చూశారా.. వీడియో షేర్‌ చేసిన నమ్రతా.
Follow us on

Mahesh Babu: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీ కుటుంబాల్లో ఘట్టమనేని ఫ్యామిలీ సభ్యులు ముందు వరుసలో ఉంటారని చెప్పాలి. నమ్రతతో పాటు మహేష్‌ బాబు, సితార, గౌతమ్‌ ఇలా అందరూ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌లు చేస్తుంటారు. ఫ్యామిలీతో గడిపే మధుర క్షణాలను, మహేష్‌ బాబు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకోవడం నమ్రతకు అలవాటు. ఈ క్రమంలోనే నమ్రతా తాజాగా ఇంట్లో నిర్వహించిన వినాయక చవితి వేడుకలను అభిమానులతో పంచుకున్నారు.

ఇంట్లో వినాయక విగ్రహ ప్రతిష్ట మొదలు నిమర్జనం వరకు అన్ని కార్యక్రమాలను ఒక చిన్న వీడియోలా రూపొందించిన నమ్రతా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ వేడుకల్లో మహేష్‌తో పాటు నమ్రతా, గౌతమ్‌, సితారా కూడా పాల్గొన్నారు. చివరగా మట్టి గణేశుడిని ఇంట్లోనే ఓ బకెట్‌లో నిమర్జనం చేసి.. పర్యావరణ పరిక్షణకు మేము సైతం అని చెప్పకనే చెప్పారు.

ఇక ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన నమ్రతా.. ‘గణేశుడికి వీడ్కోలు ఎప్పుడూ ఉండదు. ఆ దేవ దేవుడి కృప మా కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది. వచ్చే ఏడాది మళ్లీ త్వరగా వస్తావని ఆశిస్తున్నాను’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. ఈ వీడియో చూసిన మహేష్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మరి సూపర్‌ స్టార్‌ ఇంట చవితి వేడుకలు ఎలా జరిగాయో మీరూ చూసేయండి.

Also Read: Couple Arrest: మత్తెక్కించే అందాలు.. మైమరపించే చిందులు.. కన్నింగ్‌ కపుల్స్‌ చీటింగ్‌.. విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు! 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రియ దంపతులు(ఫొటోస్): Shriya couple In Thirumala Photos.

Viral Photo: ఈ ఫొటోలో ముద్దులొలికేలా ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడీమె ఓ బడా హీరోయిన్‌..