సెట్స్‌పైకి వెళ్లిన నాగశౌర్య, రీతూ వర్మ

| Edited By:

Oct 12, 2020 | 3:40 PM

కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో మూవీ షూటింగ్‌ల హవా మొదలైంది. గత నెల నుంచే పలువురు సెట్స్ మీదకు వెళ్లారు.

సెట్స్‌పైకి వెళ్లిన నాగశౌర్య, రీతూ వర్మ
Follow us on

Naga Shaurya back to set: కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో మూవీ షూటింగ్‌ల హవా మొదలైంది. గత నెల నుంచే పలువురు సెట్స్ మీదకు వెళ్లారు. ఇక భారీ బడ్జెట్ చిత్రమైన ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ కూడా ఇటీవల మొదలైంది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ మూవీ షూటింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా యువ నటుడు నాగ శౌర్య షూటింగ్‌ని ప్రారంభించేశారు. మహిళా దర్శకురాలు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగ శౌర్య ఓ మూవీలో నటిస్తుండగా.. ఈ మూవీ షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్‌గా రీతూ వర్మ నటిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. నాగశౌర్య, రీతూలపై పలు సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఆ ఫొటోలను నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. కాగా మ్యూజికల్ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

Read More:

‘ఎఫ్‌ 3’లో కీలక పాత్రలో సునీల్‌..!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అలాంటి మూవీ కాదు.. టీమ్‌ క్లారిటీ