బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మహేశ్‌బాబు

|

May 18, 2019 | 5:38 PM

విజయవాడ: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ రోజు సాయంత్రం విజయవాడకు చేరుకున్న ‘మహర్షి’ బృందం సభ్యులు ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఈ బృందానికి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మహేశ్‌బాబు, మహర్షి చిత్ర బృందాన్ని సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. విజయవాడకు వచ్చిన మహేశ్‌, వంశీపైడిపల్లి, దిల్‌రాజు తదితరులను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ సాయంత్రం 6గంటలకు విజయవాడలోని సిద్దార్థ కళాశాలలో […]

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న మహేశ్‌బాబు
Follow us on

విజయవాడ: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ రోజు సాయంత్రం విజయవాడకు చేరుకున్న ‘మహర్షి’ బృందం సభ్యులు ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఈ బృందానికి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. మహేశ్‌బాబు, మహర్షి చిత్ర బృందాన్ని సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. విజయవాడకు వచ్చిన మహేశ్‌, వంశీపైడిపల్లి, దిల్‌రాజు తదితరులను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ సాయంత్రం 6గంటలకు విజయవాడలోని సిద్దార్థ కళాశాలలో ‘మహర్షి’ చిత్ర విజయోత్సవ వేడుకల్లో మూవీ యూనిట్ సందడి చేయనుంది.