
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను నిలిపివేయడంపై ఆ చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయంచారు. చిత్రాన్ని ఏపీలో విడుదల చేయకుండా ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేశారు.
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఏపీ మినహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఏపీలో విడుదలపై ఆ రాష్ట్ర హైకోర్టు ఏప్రిల్ 3వరకు స్టే విధించింది. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత రాకేశ్రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.