స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా స్టోరీ లైన్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బన్నీ.. పూజా హెగ్డేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఇక సుశాంత్కు పూజా హెగ్డే చెల్లెలు. అలానే బన్నీ చెల్లెలు నివేదాను సుశాంత్ ప్రేమిస్తాడు. ఈ ప్రేమ జంటలు చివరికి కలిశారా.? లేదా అనే కథాంశం అని తెలుస్తోంది. చూస్తుంటే రామ్ నటించిన ‘నేను శైలజా’ సినిమా గుర్తుకు వస్తోంది కదా. ఇక ఈ స్టోరీ లైన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక దీనిపై తాజాగా చిత్ర యూనిట్ స్పందించి.. ఇవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.