సక్సెస్ ఫుల్ యాక్టర్స్ రెమ్యునరేషన్స్ భారీగా పెంచుతున్నారు. నటీనటులతో పోలిస్తే నటీమణుల పారితోషికం తక్కువగా ఉంటున్నప్పటికీ, ఇటీవల బాగానే పెంచేశారు. కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న తొలి దక్షిణాది నటి నయనతార గుర్తింపు పొందింది.
అయితే మహళా కథ బలం ఉన్న మూవీకి ఎక్కువగానే తీసుకుంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు నయనతార రూ.8 కోట్లు తీసుకుంటోంది.
ఇటీవల వరుస సినిమాలు చేస్తున్న త్రిష ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఒక్క సినిమాకే రూ.12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే నయనతార రికార్డును త్రిష బ్రేక్ చేసినట్టే అవుతుంది.
విశ్వంభర టీమ్ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి వశిష్ట దర్శకుడు.
ఈ ఇంట్రెస్టింగ్ మూవీలో త్రిష ద్విపాత్రాభినయం చేయనుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం రెండు భారీ షెడ్యూల్స్ కూడా పూర్తి చేసింది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 జనవరి 10న విడుదల కానుంది.