ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నటుడు సూర్య ప్రసాద్ అన్నారు. రాకేశ్ రెడ్డి తీసుకురమ్మంటేనే జయరామ్ను తీసుకెళ్లామని చెప్పారు. తనకు సాయం చేయాలని కోరుతూ ఓ సెల్ఫీ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ కేసులో తన స్నేహితుడు కిశోర్కు కూడా ఎలాంటి సంబంధం లేదని సూర్య చెప్పుకొచ్చారు. కాగా జయరామ్ హత్య కేసులో ఇప్పటికే ఐదుగురు అరెస్ట్ అవ్వగా.. గురువారం సూర్య ప్రసాద్, కిశోర్, అంజి రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.