మాటల మాంత్రికుడి ఇంట్లో కూడానా..!

| Edited By: Srinu

Dec 26, 2019 | 6:19 PM

టాలీవుడ్‌లో జీఎస్టీ సోదాలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పన్నును ఎగవేశారన్న కారణాలతో టాలీవుడ్‌కు చెందిన పలువురి ఇళ్లలో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొన్నటికి మొన్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంటిపై అధికారులు దాడులు చేయగా.. తాజాగా మాటల మాంత్రికుడి ఇంట్లో కూడా సోదాలు జరిగినట్లు సమాచారం. త్రివిక్రమ్ ఇంటికి వెళ్లిన అధికారులు ఆయన అకౌంట్లను చెక్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆయనతో పాటు మరో రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ ఇంట్లోనూ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. […]

మాటల మాంత్రికుడి ఇంట్లో కూడానా..!
Follow us on

టాలీవుడ్‌లో జీఎస్టీ సోదాలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పన్నును ఎగవేశారన్న కారణాలతో టాలీవుడ్‌కు చెందిన పలువురి ఇళ్లలో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొన్నటికి మొన్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంటిపై అధికారులు దాడులు చేయగా.. తాజాగా మాటల మాంత్రికుడి ఇంట్లో కూడా సోదాలు జరిగినట్లు సమాచారం. త్రివిక్రమ్ ఇంటికి వెళ్లిన అధికారులు ఆయన అకౌంట్లను చెక్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆయనతో పాటు మరో రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ ఇంట్లోనూ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు త్రివిక్రమ్ స్నేహితుడు, నిర్మాత రాధాకృష్ణ నిర్మాణ సంస్థలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మంట్స్ ఆఫీసుల్లోనూ సోదాలు జరిగినట్లు సమాచారం.

కాగా జీఎస్టీ అధికారులు బుధవారం యాంకర్ అనసూయకు షాక్ ఇచ్చారు. రూ.55లక్షలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. త్వరలో మరికొందరికి కూడా ఈ నోటీసులు వెల్లనున్నట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ స్థానికంగా ఉన్న వ్యాపారస్థులు, ఫైనాన్స్ సంస్థలు, బిల్డర్స్, దర్శకనిర్మాతలకు చెందిన 23 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తప్పుడు ధ్రువపత్రాలను చూపి చెల్లించాల్సిన జీఎస్టీని చెల్లించకుండా వీరు ఎగవేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమర్పించిన పత్రాలు, చెల్లించిన మొత్తం సరైనవేనా..? అన్న సందేహంతోనే అధికారులు ఈ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్-100 లిస్ట్‌లో త్రివిక్రమ్ 77వ స్థానాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్, మహేష్ బాబు తరువాత టాలీవుడ్ నుంచి త్రివిక్రమ్ ఈ లిస్ట్‌లో స్థానం దక్కించుకోవడం విశేషం.