‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌ కోసం… గాయకుడిగా ధృవ్‌ విక్రమ్‌!

| Edited By:

Aug 17, 2019 | 5:02 PM

ప్రముఖ కోలీవుడ్ హీరో విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ ‘ఆదిత్య వర్మ’ సినిమాతో తమిళ తెరకు హీరోగా పరిచయం కాబోతున్నారు. తెలుగు హిట్‌ ‘అర్జున్‌ రెడ్డి’కి రీమేక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ధృవ్‌ గాయకుడిగా మారారు. సినిమాలోని ఓ పాటను పాడారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. ధృవ్‌ గాత్రం అభిమానుల్ని ఆకట్టుకుంది. ఈ వీడియోకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభించింది. కొన్ని గంటల్లోనే 3 లక్షల మందికిపైగా చూశారు. […]

‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌ కోసం... గాయకుడిగా ధృవ్‌ విక్రమ్‌!
Follow us on

ప్రముఖ కోలీవుడ్ హీరో విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ ‘ఆదిత్య వర్మ’ సినిమాతో తమిళ తెరకు హీరోగా పరిచయం కాబోతున్నారు. తెలుగు హిట్‌ ‘అర్జున్‌ రెడ్డి’కి రీమేక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ధృవ్‌ గాయకుడిగా మారారు. సినిమాలోని ఓ పాటను పాడారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. ధృవ్‌ గాత్రం అభిమానుల్ని ఆకట్టుకుంది. ఈ వీడియోకు యూట్యూబ్‌లో మంచి స్పందన లభించింది. కొన్ని గంటల్లోనే 3 లక్షల మందికిపైగా చూశారు. 35 వేల మంది లైక్‌ చేయడం విశేషం. అంతేకాదు ఇది యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

‘ఆదిత్య వర్మ’ సినిమాకు గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. బనితా సంధు, ప్రియా ఆనంద్‌, రాజా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తొలుత ‘వర్మ’ పేరుతో దర్శకుడు బాలా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. చివరి దశలో అవుట్‌పుట్‌ సరిగా రాలేదన్న కారణంతో చిత్ర విడుదలను ఆపేశారు. ఈ నేపథ్యంలో బాలా సినిమా నుంచి తప్పుకున్నారు.