అల వైకుంఠపురంలో: ‘బుట్ట బొమ్మ’.. అదిరిపోయిందమ్మా

| Edited By:

Dec 22, 2019 | 3:58 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో ఇప్పటికే మూడు పాటలను విడుదల చేయగా.. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సామజవరగమన, రాములో రాములా పాటలకు ఆన్‌లైన్‌లో 100మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి నాలుగో […]

అల వైకుంఠపురంలో: బుట్ట బొమ్మ.. అదిరిపోయిందమ్మా
Follow us on

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో ఇప్పటికే మూడు పాటలను విడుదల చేయగా.. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సామజవరగమన, రాములో రాములా పాటలకు ఆన్‌లైన్‌లో 100మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఇక తాజాగా ఈ మూవీ నుంచి నాలుగో పాటకు సంబంధించిన టీజర్ విడుదలైంది. ‘బుట్ట బొమ్మా’ అంటూ సాగే రొమాంటిక్ మెలోడీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఈ పాట ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ఇక తాజాగా టీజర్‌ను విడుదల చేసిన టీమ్.. ఫుల్ సాంగ్‌ను 24న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది. కాగా ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా అర్మాన్ మాలిక్ పాటను పాడారు. ఇక ఈ పాటకు థమన్ అందించిన సంగీతం అదిరిపోయింది. దీంతో ఈ పాట కోసం ఎదురుచూస్తున్నామంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అల వైకుంఠపురంలో సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించగా.. టబు, నివేథా పేతురాజ్, జయరామ్, సుశాంత్, నవదీప్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే టీజర్, పాటలతో ఆకట్టుకున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.