Bollywood: బాలీవుడ్ కు భారీ నష్టాన్ని మిగిలిచిన వర్షాలు.. నీటిపాలైన సినిమా సెట్లు..

కరోనాతో దెబ్బతిన్న ఫిల్మ్‌ ఇండస్ట్రీని తౌటే తుఫాను మరింత దెబ్బకొట్టింది. సినిమాల కోసం వేసిన భారీ సెట్లను నేలకూల్చి.. బాలీవుడ్‌ నిర్మాతలకు కోట్లల్లో నష్టాలను మిగిల్చింది.

Bollywood: బాలీవుడ్ కు భారీ నష్టాన్ని మిగిలిచిన వర్షాలు.. నీటిపాలైన సినిమా సెట్లు..
Ajay Devgan

Updated on: May 22, 2021 | 8:06 PM

Bollywood: కరోనాతో దెబ్బతిన్న ఫిల్మ్‌ ఇండస్ట్రీని తౌక్టే తుఫాను మరింత దెబ్బకొట్టింది. సినిమాల కోసం వేసిన భారీ సెట్లను నేలకూల్చి.. బాలీవుడ్‌ నిర్మాతలకు కోట్లల్లో నష్టాలను మిగిల్చింది. దీంతో బీ టౌన్‌ నిర్మాతలందరూ జరిగిన నష్టాన్నితలుచుకుంటూ తలలు పట్టుకు కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, మ్యాన్లీ మ్యాన్‌ అజయ్‌ దేవ్‌గన్‌ సినిమా సెట్లను తుఫాను దెబ్బతీసింది. బాలీవుడ్‌ బడా నిర్మాత సల్మాన్‌ నెక్ట్‌ సినిమా టైగర్‌ కోసం ఓ ఇంటి సెట్‌ను వేయగా ఆ సెట్ మొత్తం తౌక్టే దాటికి నేలకొరింది.

అజయ్‌ దేవ్‌ గన్‌ తదుపరి చిత్రం “మైదాన్‌” కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌ను కూడా తౌక్టే పూర్తిగా దెబ్బతీసింది. ఇప్పటికే మైదాన్ సినిమా ను భారీ మొత్తంతో నిర్మిస్తున్నారు. అనుకున్న బడ్జెట్ కంటే ఈ సినిమాకు ఎక్కువ ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో సెట్టింగ్ తుఫాన్ దాటికి నాశనం అవ్వడంతో మళ్లీ పునర్ నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. దానితో పాటు ఆయనే డైరెక్షన్‌ చేస్తూ నిర్మిస్తున్న పాన్‌ ఇండియా మూవీ “మేడే” సెట్ కూడా ఈ తుఫాను పూర్తిగా నాశనం చేసింది. దీంతో అజయ్‌ దేవ్ గన్‌ భారీగా నష్టాలపాయ్యారని బీ టౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Singer Madhu Priya : సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధుప్రియ.. కారణం ఇదే..

Nandamuri Balakrishna: మన మధ్య ఆయన లేరనే వార్త తనను కలచివేసింది.. బీఏ రాజు మృతిపట్ల ఎమోషనల్ అయిన బాలయ్య…

Manchu Lakshmi: మంచి మ‌న‌సు చాటుకున్న మంచు ల‌క్ష్మి… క‌రోనాతో మ‌ర‌ణించిన వారి చిన్నారుల‌కు అండ‌గా..

NTR BA Raju Death: నిర్మాత బీఏ రాజు మ‌ర‌ణంపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన ఎన్టీఆర్‌.. త‌న‌తో ఉన్న అనుబంధాన్ని..

Loading...
Unable to load recommendations.
Follow Us