‘బిగ్‌బాస్’ నిర్వాహకులకు ఊహించని షాక్..!

| Edited By:

Apr 16, 2020 | 4:22 PM

తెలుగు బుల్లితెరపై గ్రాండ్ విజయం సాధించిన రియాల్టీ షోలలో బిగ్‌బాస్ ఒకటి. ఇప్పటికి ఈ షో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

బిగ్‌బాస్ నిర్వాహకులకు ఊహించని షాక్..!
Follow us on

తెలుగు బుల్లితెరపై గ్రాండ్ విజయం సాధించిన రియాల్టీ షోలలో బిగ్‌బాస్ ఒకటి. ఇప్పటికి ఈ షో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక అన్నీ కుదిరితే ఈ ఏడాది జూలైలో నాలుగో సీజన్‌ ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లు, హోస్ట్‌ల కోసం నిర్వాహకులు ఇప్పుడు పలువురితో సంప్రదింపులు జరుపుతున్నారట. అయితే ఈ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌లుగా పాల్గొనేందుకు ఎవ్వరూ ఆసక్తిని చూపడం లేదని సమాచారం. ఎందుకంటే బిగ్‌బాస్‌ షోపై చాలా మందికి నెగిటివ్ సెంటిమెంట్ ఉందట.

అసలు విషయంలోకి వెళ్తే.. హిందీ బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారికి.. షో తరువాత మంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ తెలుగులో పరిస్థితి విభిన్నంగా ఉందట. బిగ్‌బాస్‌లో పాల్గొని హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎవ్వరికీ పెద్దగా ఆఫర్లు రావడం లేదట. కంటెస్టెంట్లు మాత్రమే కాదు బిగ్‌బాస్ విన్నర్‌లకు కూడా షో తరువాత అడపాదడపా అవకాశాలు మాత్రమే వస్తున్నాయట. ఇందుకు ఉదాహరణగా మూడు సీజన్లలో విజేతలైన శివబాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్‌లను చూపిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ షోలో పాల్గొనకపోవడమే మంచిదని చాలామంది భావిస్తున్నారట. దీంతో నిర్వాహకులు ఫోన్లు చేస్తున్నా వారు పట్టించుకోవడం లేదట. ఎక్కువ రెమ్యునరేషన్‌ ఇస్తామని చెప్పినా.. ఈ షోలో పాల్గొనేందుకు వారు ఆసక్తిని చూపడం లేదన్నది టాక్‌. ఈ క్రమంలో కొంతమంది సింగర్లు, సెకండరీ గ్రేడ్ నటులను తీసుకురావాలని బిగ్‌బాస్‌ నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. మరి ఈ సారి బిగ్‌బాస్‌లో ఎవరు పాల్గొనబోతున్నారు..? ఏ స్టార్ నటుడు హోస్ట్‌గా చేయబోతున్నారు..? లాంటి ప్రశ్నలకు త్వరలోనే సమాధానం తెలియనుంది.

Read This Story Also: షాకింగ్ నిర్ణయం తీసుకున్న కొరటాల.. ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్..!