
అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ అటు సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా తన ప్రతీభను చూపిస్తున్నారు. బిగ్ బి వ్యాఖ్యతగా వ్యవహిస్తున్న కౌన్ బనేనా కరోడ్ పతి షోకు ప్రేక్షకులలో ఉన్న ఫాలోయింగ్ గురించి వీడిగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది ఈ షోలో పాల్గొని బిగ్ బి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి డబ్బులు గెలుచుకొని వెళ్తుంటారు. ఈ సందర్భంగా కౌన్ బనేనా కరోడ్ పతి వేదికగా అమితాబ్ తన కెరిర్లోనే సూపర్ హిట్ సాధించిన షోలే సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర కలిసి నటించిన చిత్రం షోలే. ఇటీవలే ఈ సినిమా విడుదలై 45 ఏళ్ళు పూర్తయ్యాయి. కాగా ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ డిఐజీ ప్రీత్ మోహన్ భార్య సత్వీందర్ కౌన్ పాల్గొన్నారు. మీ షోలే సినిమాకు మా ఆయన వీరాభిమాని అని ఆమె చెప్పగా.. ఆ సినిమా షూటింగ్కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని అమితాబ్ బయటపెట్టారు. షోలే చిత్రీకరణ సమయంలో క్లైమాక్స్లో ఓ సన్నివేశానికి ధర్మేంద్ర చాలా టేక్లు తీసుకున్నారు. దీంతో ఆయనకు చాలా చిరాకు వచ్చింది. వెంటనే ఓ బాక్సులో ఉన్న బుల్లెట్లు తీసుకుని తుపాకీలో లోడ్ చేసి షూట్ చేయగా, ఒక బుల్లెట్ నా చెవి పక్కనుంచే వెళ్ళింది. ఆ సన్నివేశానికి రెండు, మూడు టేకులు తీసుకున్నారు. కానీ అనుకోకుండా తుపాకీలోని బుల్లెట్లు పేలడంతో ఆయన షాక్ అయ్యారు. ఆ సమయంలో నేను దూరంగా ఓ కొండపై నిల్చోని ఉన్నాను. అదృష్టశాత్తూ నాకేమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అని అమితాబ్ చెప్పారు.