మహేష్‌, ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్‌.. ‘మెగా’ నిర్మాత ‘బడా’ ప్లాన్‌..!

| Edited By:

Jul 21, 2020 | 11:28 AM

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌లకు క్రేజ్‌ పెరుగుతోంది. సీనియర్ హీరోలు మొదలు యంగ్ హీరోలు సైతం మల్టీస్టారర్‌లలో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

మహేష్‌, ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్‌.. మెగా నిర్మాత బడా ప్లాన్‌..!
Follow us on

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌లకు క్రేజ్‌ పెరుగుతోంది. సీనియర్ హీరోలు మొదలు యంగ్ హీరోలు సైతం మల్టీస్టారర్‌లలో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో తెలుగులో మరో క్రేజీ మల్టీస్టారర్‌ రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌ సూపర్‌స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌లతో మల్టీస్టారర్‌ తీసేందుకు మెగా నిర్మాత అల్లు అరవింద్ బడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఇద్దరు హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉన్న అల్లు అరవింద్‌.. వీరిద్దరిని ఒకే ఫ్రేమ్‌లో చూపించడం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలో వారితో సంప్రదించడం, వారు ఓకే చెప్పేయడం జరిగిపోయాయని సమాచారం. ఇక వచ్చే ఏడాదిన ఈ సినిమా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్‌. ఒకవేళ ఇదే నిజమైతే ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌కి పండగే. అలాగే మరో క్రేజీ మల్టీస్టారర్‌ను టాలీవుడ్‌ చూడనుంది. కాగా ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్నారు. ఇందులో రామ్‌ చరణ్‌తో కలిసి నటిస్తున్నారు ఎన్టీఆర్. ఇక ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించబోతున్నారు. మరోవైపు మహేష్ బాబు, పరశురామ్‌ దర్శకత్వంలో సర్కారు వారి పాటలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.