West Bengal election 2021: బెంగాల్‌లో ఉద్రిక్తంగానే పరిస్థితులు.. మళ్లీ పెద్ద ఎత్తున బాంబుల స్వాధీనం..

|

Apr 13, 2021 | 9:07 AM

Crude Bombs: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు ముగిశాయి. ఇంకా

West Bengal election 2021: బెంగాల్‌లో ఉద్రిక్తంగానే పరిస్థితులు.. మళ్లీ పెద్ద ఎత్తున బాంబుల స్వాధీనం..
Bombs Recovered In Murshidabad
Follow us on

Crude Bombs: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు ముగిశాయి. ఇంకా నాలుగు విడతల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల నేపథ్యంలో విపక్ష పార్టీల మధ్య నిత్యం ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి సంఘటన చోటుచేసుకుంటుందోనని అంతటా ఆందోళన నెలకొంది. ఇటీవలనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి పెద్ద ఎత్తున బాంబులు పట్టుబడటం కలకలం రేపుతోంది. సోమవారం ముర్షిదాబాద్‌ జిల్లాలోని షంషేర్‌గంజ్‌‌ ప్రాంతంలో సోమవారం 14 బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 17న రాష్ట్రంలో ఐదో దశ పోలింగ్‌ జరగనుంది. దీనికి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.

ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన నాటినుంచి రాష్ట్రంలోని పలుచోట్ల పెద్ద ఎత్తున బాంబులను, తయారీ పరికరాలను, గన్‌ పౌడర్‌, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగో విడత ఎన్నికల్లో కూడా ఓ కమ్యూనిటీ హాల్లో 200 బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకొని నిర్వీర్యం చేశారు. అయితే ఎన్నికల సమయంలో పెద్దఎత్తున బాంబులు బయటపడుతుండడంతో రాష్ట్రమంతటా ఆందోళన నెలకొంది.

ఈ నెల 10న నాలుగో విడత ఎన్నికల్లో కూచ్‌ బెహార్‌ జిల్లాలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు టీఎంసీ కార్యకర్తలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటన అనంతరం ఇంటిలిజెన్స్ నివేదిక ప్రకారం.. 126 పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో వాయిదా వేయాలని, దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించింది. ఈ ఘటన తర్వాత కూచ్ బెహార్ జిల్లాలోకి ఎవరూ ప్రవేశించకుండా 72 గంటల పాటు నిషేధం విధించింది. 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

Also Read:

Gun Misfire: తుపాకీ మిస్‌ఫైర్‌ ఘటనలో కొత్త కోణం.. క్షణికాశంలో హోంగార్డే భార్యపై కాల్పులు

Road Accident: ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. ఏడుగురు మృతి..