రేపటి కీలకపోరుకు ఈసీ సర్వంసిద్ధం… బెంగాల్‌, అస్సాంలో మూడో విడత.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి ఒకే దశలో పోలింగ్‌

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరుగుతున్న ఎన్నికల సంగ్రామం తుది దశకు చేరుకుంది. పోలింగ్‌ కోసం ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

రేపటి కీలకపోరుకు ఈసీ సర్వంసిద్ధం... బెంగాల్‌, అస్సాంలో మూడో విడత.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి ఒకే దశలో పోలింగ్‌
Assembly Elections 2021
Follow us

|

Updated on: Apr 05, 2021 | 10:06 AM

Assembly Elections 2021: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరుగుతున్న ఎన్నికల సంగ్రామం తుది దశకు చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తమిళనాడులో 234 స్థానాలు, కేరళలో 140 స్థానాలు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. రెండు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఒకే విడుతలో పోలింగ్‌ జరుగనున్నది. అలాగే మూడో విడుతలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని 31 సీట్లకు, అస్సాంలోని 40 స్థానాలకు కూడా పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు సాగించిన ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరుకుంది. పోలింగ్‌ కోసం ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సెమి ఫైనల్‌గా భావిస్తున్నాయి. దీంతో అన్ని పార్టీ అగ్రశ్రేణి నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

దేవభూమిగా భావించే కేరళలో మునుపెన్నడు లేనంతగా రాజకీయ వాతావరణం వేడేక్కింది. కేరళలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ ఉవ్విళ్లూరుతోంది. దీంతో వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌తో బీజేపీ పోటీ పడుతుండటంతో ముక్కోణపు పోరు నెలకొంది. గోల్డ్ స్కామ్, డాలర్ కేసులో చిక్కుకున్న కేరళ సర్కార్ అంశం తమకు కలిసివస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ అంశాలనే లక్ష్యంగా చేసుకొని ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. ఇటీవల యూపీలో క్రైస్తవ సన్యాసినులపై వేధింపుల ఘటనలు మైనారిటీ ఓటర్లను బీజేపీకి దూరం చేసే అవకాశమున్నది. ఈ అంశం అధికార కూటమికి కలసివచ్చే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ‘మెట్రో మ్యాన్‌’ శ్రీధరన్‌.. ఆ పార్టీకి ఏ మేరకు లాభాన్ని తెచ్చిపెడుతుందో చూడాలని చెబుతున్నారు.

ఇద్దరు దిగ్గజ రాజకీయవేత్తలు, దివంగత మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి లేకుండా తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండటంతో అందరి దృష్టి తమిళనాడు రాజకీయాలపై పడింది. గత సంప్రదాయానికి భిన్నంగా రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే మరోసారి ఆధిపత్యాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. ‘అమ్మ (జయలలిత) పరిపాలన’ను కొనసాగించేందుకు మరో అవకాశం ఇవ్వాలని సీఎం కే పళనిస్వామి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగానే భారతీయ జనతా పార్టీతో జత కట్టి ఎన్నికల బరిలో నిలిచింది. ఇక, కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్న డీఎంకే నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధ్యక్షుడు స్టాలిన్‌ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీటీవీ దినకరణ్‌ ఏఎంఎంకే, కమల్‌హాసన్‌ ఎంఎన్‌ఎం పార్టీల ప్రభావం అంతంత మాత్రమే అంటున్నారు విశ్లేషకులు.

ఇక, తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న 234 స్థానాల్లో దాదాపు 15 స్థానాల నుంచి తెలుగు వ్యక్తులు బరిలో నిలిచారు. అన్నాడీఎంకే నుంచి 10 మంది, డీఎంకే నుంచి ఐదుగురు పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా కొలతూరు నుంచి బరిలో ఉన్న డీఎంకే అధ్యక్షుడు, ఎంకే స్టాలిన్‌పై తెలుగు వ్యక్తి, అన్నాడీఎంకే నేత ఆది రాజారామ్‌ పోటీ చేస్తున్నారు. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరణ్‌పై అన్నాడీఎంకే నేత, మరో తెలుగు వ్యక్తి ఆర్‌ఎస్‌ రాజేశ్‌ పోటీ చేస్తున్నారు.

ఇక, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి రాజకీయం రసవత్తంగా మారింది. బలపరీక్షలో విఫలమైన నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్ కుప్పకూలడంతో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించారు. డీఎంకేతో కలిసి మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు నారాయణ స్వామి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, అధికారంలోకి వచ్చేందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించింది. అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తమిళనాడులో ప్రవేశానికి పుదుచ్చేరిని తొలి మెట్టుగా అది భావిస్తున్నది. అయితే, బీజేపీ కాంగ్రెస్‌ ఎన్‌ఆర్‌, అన్నాడిఎంకె కూటమికి పుదుచ్చేరిలో చోటివ్వరాదని కాంగ్రెస్‌,డిఎంకె, లెఫ్ట్‌ కూటమి గట్టిగా కృషి చేస్తున్నది. పుదుచ్చేరిలో ఆదివారం సాయంత్రం నుంచే 144 సెక్షన్‌ విధించారు. మద్యం దుకాణాలు, బార్లను శనివారం రాత్రి నుంచే మూసివేశారు. ఎన్నికల పోలింగ్‌ ముగిసేవరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఎన్నికల కమిషన్‌ తెలిపింది.

మరోవైపు, బెంగాల్ ఎన్నికలు బీజేపీకి, తృతమూల్‌కు అగ్ని పరీక్షగా మారాయి. మూడోసారి అధికారంలోకి వచ్చి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని మమత బెనర్జీ ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా బెంగాల్‌లో పాగా వేయాలని కమలం నేతలు సర్వశక్తులు వడ్డుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమై ఎనిమిది విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో.. కాంగ్రెస్‌, వామపక్షాలు, ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ కలిసి పోటీచేయడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. బెంగాల్‌లో 8 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు విడతల్లో పూర్తి కాగా, ఇంకా ఐదు విడతల ఎన్నికలు జరగాల్సి ఉంది. మంగళవారం జరగనున్న మూడోదశలో ఎన్నికలు జరుగనున్న బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ సాగుతోంది. ప్రచారంలో నేతల మధ్య మాటలతోనే యుద్ధాలు చేసుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ లెఫ్ట్‌ కూటమి ప్రచారంలో వెనుకబడింది.

ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్దదైన అసోం ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ కాంగ్రెస్ ప్రచారంలో హోరెత్తించాయి. మొత్తంగా మూడు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తి కాగా, చివరి విడత మంగళవారం జరగనుంది. వీటి ఫలితాలు మే 2న ప్రకటిస్తారు. మొత్తంగా 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిలో ఎనిమిది ఎస్సీ, 16 ఎస్టీ నియోజకవర్గాలున్నాయి. తుది విడుత ఎన్నికల్లో అధికార బీజేపీ అస్సాం గణపరిషత్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి, కొత్తగా ఏర్పాటైన అస్సాం జతియా పరిషత్‌ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్.. ఏఐయూడీఎఫ్, ఆర్జేడీ, అంచలిక్ గణ్ మోర్చా, సీపీఐఎంఎల్ పార్టీలతో మహా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి.

Read Also…  పెళ్లి ముచ్చట తీరకుండా అమరులైన ఇద్దరు వీర జవాన్లు.. నక్సల్స్ కాల్పుల్లో మృతి చెందిన ఆంధ్ర యువకులు

నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
నెలకు రూ. 29తోనే.. జియో సినిమా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌..
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
డయాబెటిస్‌ రోగులు వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. లేదంటే!
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
ఎక్కడుంది.. ఎక్కడుంది ఆ పాము.. ఏ కుండ కింద నక్కినాది..?
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్