మద్యం దొరక్క వింతగా ప్రవర్తిస్తోన్న లిక్కర్ ప్రియులు…
కరోనా దెబ్బతో మద్యం దుకాణాలు బంద్ కావడంతో మందు బాబుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. నిజామాబాద్ జిల్లాలో వింత ప్రవర్తనతో – మద్యం ప్రియులు హల్చల్ చేస్తున్నారు. గాయత్రీనగర్కు చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సాయినగర్కు చెందిన మరో మహిళ వింత ప్రవర్తనతో ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కల్లు దొరక్కపోవడంతోనే మూడ్రోజులుగా పిచ్చిగా ప్రవర్తించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కల్లు అనుకొనే […]
కరోనా దెబ్బతో మద్యం దుకాణాలు బంద్ కావడంతో మందు బాబుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. నిజామాబాద్ జిల్లాలో వింత ప్రవర్తనతో – మద్యం ప్రియులు హల్చల్ చేస్తున్నారు. గాయత్రీనగర్కు చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సాయినగర్కు చెందిన మరో మహిళ వింత ప్రవర్తనతో ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కల్లు దొరక్కపోవడంతోనే మూడ్రోజులుగా పిచ్చిగా ప్రవర్తించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కల్లు అనుకొనే ఫినాయిల్ తాగి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో చాలామంది కల్లు దొరకడం లేదని వింత చేష్టలతో భోజనం కూడా సరిగా చేయకుండా వింతగా ప్రవర్తిస్తున్నారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మద్యం ఒక్కసారిగా దొరక్కపోవడంతో విత్డ్రావెల్ సిండ్రోమ్ కారణంగా ఇలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు డాక్టర్లు. ఇక రాజన్న సిరిసిల్లా జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. మద్యం దొరక్క… మందుబాబులు పిచ్చిగా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు – వారిని ఆస్పత్రిలో చేర్పిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కల్లు దొరక్కపోవడంతో కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. రాజీవ్నగర్కు చెందిన నలుగురు వ్యక్తులను 108 వాహనంలో ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.