మహిళ దారుణ హత్య..ఒంటిపై బంగారం చోరీ

|

Jul 14, 2020 | 6:54 PM

మహిళ ఒంటిపై బంగారం కోసం దోపిడీ దొంగతలు దారుణానికి ఒడిగట్టారు. మహిళను హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం ధర్మవరం సమీపంలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు కుందుల అనంతలక్ష్మిగా గుర్తించారు. మృతురాలి […]

మహిళ దారుణ హత్య..ఒంటిపై బంగారం చోరీ
Follow us on

మహిళ ఒంటిపై బంగారం కోసం దోపిడీ దొంగతలు దారుణానికి ఒడిగట్టారు. మహిళను హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం ధర్మవరం సమీపంలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు కుందుల అనంతలక్ష్మిగా గుర్తించారు. మృతురాలి వంటిపై ఉన్న బంగారం కోసమే దుండగులు ఆమెను చంపి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళ వద్ద నుంచి 15 తులాల బంగారం ఎత్తుకెళ్లారని పోలీసులు వెల్లడించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.