బీజేపీ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి కేసులో ఒకరి అరెస్ట్..

| Edited By:

Jul 16, 2020 | 5:54 AM

వెస్ట్ బెంగాల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన బీజేపీ ఎమ్మెల్యే కేసులో ఒకరిని అరెస్ట్ చేశారు పోలీఉసలు. బుధవారం నాడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్‌ రాయ్‌ మృతి కే..

బీజేపీ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి కేసులో ఒకరి అరెస్ట్..
Follow us on

వెస్ట్ బెంగాల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన బీజేపీ ఎమ్మెల్యే కేసులో ఒకరిని అరెస్ట్ చేశారు పోలీఉసలు. బుధవారం నాడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్‌ రాయ్‌ మృతి కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ రాయ్ జేబులో ఓ సూసైడ్‌ నోట్‌ను గుర్తించామని.. దాని అందులో నీలోయ్ సింగ్‌ అని పేరు ఉందని తెలిపారు. సూసైడ్ నోట్‌ ఆధారంగా సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే బుధవారం నాడే ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు.. సూసైడ్‌ నోట్‌ ఆధారంగా విచారణ చేపడుతూ.. నిందితుడు నీలోయ్ సింగ్‌ను అరెస్ట్ చేశారు.