స్వర్ణ ప్యాలెస్‌ ఘటనలో రాయపాటి మరో కోడలు విచారణ

|

Aug 18, 2020 | 6:43 PM

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా గుంటూరు రమేష్ హాస్పిటల్‌కు వెళ్లారు విజయవాడ పోలీసులు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్‌ శైలజను విచారిస్తున్నారు.

స్వర్ణ ప్యాలెస్‌ ఘటనలో రాయపాటి మరో కోడలు విచారణ
Follow us on

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా గుంటూరు రమేష్ హాస్పిటల్‌కు వెళ్లారు విజయవాడ పోలీసులు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్‌ శైలజను విచారిస్తున్నారు. రమేష్ ఆస్పత్రిలో ఆస్తర్ కంపెనీ పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. రాయపాటి మరో కోడలు డాక్టర్‌ మమతను ఇంతకుముందే పోలీసులు విచారించారు. స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆస్పత్రికి మధ్య జరిగిన ఒప్పంద పత్రాన్ని ఇప్పటి వరకు కూడా దర్యాప్తు అధికారులకు సమర్పించలేదు. నోటీసులుఇచ్చినా కూడా తమ ముందు హాజరు కావడానికి రమేష్ బాబు సాకులు చెబుతున్నారని.పోలీసులు అంటున్నారు. 9 రోజులుగా జరుగుతున్న దర్యాప్తులో పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

కాగా, స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ బాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాదం సంభవించి పది మంది మరణించిన విషయం తెలిసిందే….