AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెరువులో మునిగి ఇద్దరు యువకుల గల్లంతు..

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగిన వ్యక్తిని రక్షించబోయి ఇద్దరూ గల్లంతయ్యారు. పహాడీ షరీఫ్ మున్సిపాలిటీ పరిధిలోని జల్‌పల్లిలో చెరువులో ఈ ఘటన చోటుచేసుకుంది.

చెరువులో మునిగి ఇద్దరు యువకుల గల్లంతు..
Balaraju Goud
|

Updated on: Oct 04, 2020 | 3:10 PM

Share

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగిన వ్యక్తిని రక్షించబోయి ఇద్దరూ గల్లంతయ్యారు. పహాడీ షరీఫ్ మున్సిపాలిటీ పరిధిలోని జల్‌పల్లిలో చెరువులో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడు ఉదయం జల్‌పల్లి శివారులోని చెరువు వద్దకు వెళ్లాడు. ఆ యువకుడ ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయాడు. అటుగా వెళ్తున్న మరో యువకుడు అతడిని గమనించి రక్షించేందుకు ప్రయత్నించే క్రమంలో చెరువులోకి దిగాడు. దీంతో ఇద్దరూ నీటమునిగి గల్లంతయ్యారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సాయంతో చెరువులో గాలింపు చేపట్టారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యలు చెరువు వద్ద కన్నీటిపర్యంతయ్యారు.అయితే, ఇద్దరు నీటమునిగి చనిపోయి ఉంటారని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది భావిస్తున్నారు.