షోలాపూర్‌ జిల్లాలో గోడ కూలి ఆరుగురు మృతి

|

Oct 14, 2020 | 9:00 PM

మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల ధాటికి షోలాపూర్‌ జిల్లాలోని పండర్‌పూర్‌ పట్టణంలో ఓ గోడ కూలింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలను కోల్పోయారు.

షోలాపూర్‌ జిల్లాలో గోడ కూలి ఆరుగురు మృతి
Follow us on

మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల ధాటికి షోలాపూర్‌ జిల్లాలోని పండర్‌పూర్‌ పట్టణంలో ఓ గోడ కూలింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలను కోల్పోయారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో చంద్రభాగ నది ఒడ్డున ఉన్న ఇల్లు తడిసి ముద్ధైంది. ఇవాళ మరోసారి కురిసిన వర్షానికి ఇంటి గోడ కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు నలుగురు కాగా.. భారీ వర్షంతో అక్కడికి చేరుకున్న మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు షోలాపూర్‌ ఎస్పీ వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వీరందరినీ పోలీసులు, అగ్నిమాపక, జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారంతా మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.