సింగర్ పేరుతో మోసాలు.. వెలుగుచూస్తున్న సంచలనాలు..!

| Edited By: Balu

Aug 12, 2020 | 3:00 PM

ప్రముఖ గాయని పేరిట కొందరు కేటుగాళ్లు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.1.7 కోట్లు టోకరా వేశారు. బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సింగర్ పేరుతో మోసాలు.. వెలుగుచూస్తున్న సంచలనాలు..!
Follow us on

ప్రముఖ గాయని పేరిట కొందరు కేటుగాళ్లు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.1.7 కోట్లు టోకరా వేశారు. బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొత్తపేటకు చెందిన ఓ మహిళ(44) టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ గాయనికి వీరాభిమాని. 2019లో బాధితురాలి ఇంటి దగ్గరుండే చైతన్య అనే వ్యక్తి గాయని వాట్సాప్‌ నంబర్‌ ఇచ్చాడు. రెండు, మూడు సార్లు వాట్సాప్‌లో మెసేజ్‌ చేయగానే గాయని బాధితురాలి నంబర్‌ను బ్లాక్‌ చేశారు. బాధితురాలు.. వేరే నంబర్‌ నుంచి ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి’ అంటూ మెసేజ్‌ చేసింది. సరేనంటూ.. అప్పటి నుంచి ఛాటింగ్‌ చేయడం మొదలుపెట్టారు.

ఒకరోజు కేరళలో ‘ఆనంద చేర్లాయం ట్రస్ట్‌’లో రూ.50 వేలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని సూచించడంతో.. బాధితురాలు ఆమె సూచించిన బ్యాంకు ఖాతాకు డబ్బులను బదిలీ చేసింది. అమెరికాలో ఉన్న భూములను అమ్మకానికి పెట్టానంటూ నమ్మించి.. పలు దఫాలుగా రూ.1.7 కోట్లు వసూలు చేశారు. ఎప్పటికప్పుడు గాయని ఫొటోలు వాట్సాప్‌లో పంపించేవారు. వీడియో కాల్‌ మాట్లాడేవారు కాదు. అనంతరం అనుమానం వచ్ఛి. గాయని వాట్సాప్‌ నంబర్‌ ఇచ్చిన వ్యక్తి, మరికొందరితో కలిసి మోసం చేసినట్లు ఫిర్యాదు చేసింది. చైతన్యతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే అరెస్ట్ అయిన చైతన్యను పోలీసులు విచారణ జరుపుతున్నారు.