పిడుగురాళ్లలో వ్యాపారి దారుణ హత్య

|

Jul 23, 2020 | 6:38 PM

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన పురుగుల మందు సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న పూర్ణ చంద్రరావు అనే వ్యక్తిని గుర్తు తెలియని కొందరు అతి దారుణంగా హత్య చేశారు.

పిడుగురాళ్లలో వ్యాపారి దారుణ హత్య
Follow us on

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన పురుగుల మందు సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న పూర్ణ చంద్రరావు అనే వ్యక్తిని గుర్తు తెలియని కొందరు అతి దారుణంగా హత్య చేశారు. హత్య చేసి అనంతరం బుడంపాడు మార్కెట్ వద్ద మృతదేహాన్ని పడేసివెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు..మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.