తీహార్ జైలులో(Tihar Jail) ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. 19 ఏళ్ల అండర్ ట్రయల్ ఖైదీ సీలింగ్ ఫ్యాన్కు విగతజీవిగా వేలాడుతూ కనిపించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని(Uttar Pradesh) బదౌన్ జిల్లాకు చెందిన బ్రహ్మ్ నంద్ అలియాస్ వికాస్ కిడ్నాప్, రేప్తో కేసుల్లో పోక్సో చట్టంతో ఫిబ్రవరి 4 నుంచి జైలులో ఉన్నట్లు సీనియర్ జైలు అధికారులు వెల్లడించారు. వికాస్ జైలులోని మొదటి అంతస్తులో అండర్ ట్రయల్ ఖైదీల రికార్డ్ రూమ్లో సేవదార్ గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఎప్పటిలాగే రికార్డు గదికి వచ్చిన వికాస్.. మధ్యాహ్నం 2.50 గంటలకు తన గది తలుపులు మూసి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన తోటి ఖైదీలు తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. అప్పటికే వికాస్ ఫ్యాన్ కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వికాస్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
19-year-old undertrial prisoner found hanging from ceiling fan inside Delhi’s Tihar jail: Officials
ఇదే ఏడాది జనవరిలో తిహార్ జైలులో ఐదుగురు ఖైదీలు ఆత్మహత్యకు ప్రయత్నించడం సంచలనం రేకెత్తించింది. పుదునైన ఆయుధాలతో తమను తాము తీవ్రంగా గాయపరుచుకున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు గాయపడ్డ ఐదుగురిని జైలు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఓ ఖైదీని దీన్దయాల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.