మా అక్క నుంచి ప్రాణ రక్షణ కల్పించండి..!

|

Jun 02, 2020 | 4:50 PM

హైదరాబాాద్ లో సోదరి నుండి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన మహిళ.

మా అక్క నుంచి ప్రాణ రక్షణ కల్పించండి..!
Follow us on

తన సోదరి నుండి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందంటూ ఓ మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. హైదరాబాద్ లోని కాచిగూడ నింబోలి అడ్డలో తన భర్త, ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటున్నట్లు బాధిత మహిళ ఆర్మీయా సుల్తానా కమిషన్ కు వివరించింది. మే 9న తన అక్క ఆసేవియ సుల్తానా ఆస్తి కోసం ఆమె భర్తతో కలిసి తన భర్త మహమూద్ అబ్దుల్ రెహమాన్ ను ఆజాంపురాలో హత్య చేయించినట్లు ఫిర్యాదులో పేర్కోంది. ఈ ఘటనపై చాదర్ ఘాట్ పోలీసులు తన సోదరి భర్తను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. అయితే హత్యకు సూత్రధారి అయిన తన సోదరిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా తాను ఉంటున్న ఇంటిని వదిలి వెళ్లకపోతే తనను, తన ముగ్గురు పిల్లలను హతమరుస్తానని తన అక్క బెదిరింపులకు పాల్పడుతుందని తెలిపారు. ఈ విషయంపై కాచిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోవడంలేదని కమిషన్ ముందు కన్నీరు పెట్టుకున్నారు. తనకు తన పిల్లలకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని ఆమె కమిషన్ ను వేడుకున్నారు.