దారుణం.. పట్టపగలు వేటకొడవళ్లతో వెంటాడి చంపారు

|

Oct 26, 2019 | 8:37 PM

కర్ణాటక బెంగళూరులో దారుణ హత్య జరిగింది. మహదేవపురలోని ఓ షాపింగ్ మాల్​ సమీపంలో ముగ్గురు దుండగులు కదాబిసినహళ్లికి చెందిన రౌడీషీటర్​ మంజునాథ్​ను వేటకత్తులతో నరికి చంపారు. స్నేహితురాలితో మహదేవపుర మీదగా వెళుతున్నాడు మంజునాథ్. అతడిని వెంబడిస్తూ ముగ్గురు వ్యక్తులు స్కూటీపై వచ్చారు. ఓ సిగ్నల్​ వద్ద ఆగగానే మంజునాథ్​పై దాడి చేశారు. మంజునాథ్​ తప్పించుకుని పారిపోగా వెంటాడి షాపింగ్​ మాల్ సమీపంలో పట్టుకున్నారు. అక్కడే వేట కత్తులతో విచక్షణా రహితంగా తలపై నరికారు. గుర్తుపట్టడానికి వీలులేకుండా మంజునాథ్​ […]

దారుణం.. పట్టపగలు వేటకొడవళ్లతో వెంటాడి చంపారు
Follow us on

కర్ణాటక బెంగళూరులో దారుణ హత్య జరిగింది. మహదేవపురలోని ఓ షాపింగ్ మాల్​ సమీపంలో ముగ్గురు దుండగులు కదాబిసినహళ్లికి చెందిన రౌడీషీటర్​ మంజునాథ్​ను వేటకత్తులతో నరికి చంపారు. స్నేహితురాలితో మహదేవపుర మీదగా వెళుతున్నాడు మంజునాథ్. అతడిని వెంబడిస్తూ ముగ్గురు వ్యక్తులు స్కూటీపై వచ్చారు. ఓ సిగ్నల్​ వద్ద ఆగగానే మంజునాథ్​పై దాడి చేశారు. మంజునాథ్​ తప్పించుకుని పారిపోగా వెంటాడి షాపింగ్​ మాల్ సమీపంలో పట్టుకున్నారు. అక్కడే వేట కత్తులతో విచక్షణా రహితంగా తలపై నరికారు.

గుర్తుపట్టడానికి వీలులేకుండా మంజునాథ్​ ముఖం పూర్తిగా ఛిద్రమయింది. అతడు మరణించాడని నిర్ధరించుకున్న దుండగులు వారు వచ్చిన స్కూటీపైనే అక్కడి నుంచి పారిపోయారు. ఈ భయానక దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వీటి ఆధారంగానే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. కాగా చనిపోయిన వ్యక్తికి గతంలో నేరచరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది.