తమిళనాడులో భారీ పేలుడు.. నలుగురు మృతి.. గాల్లోకి ఎగిరిపడ్డ కూలీలు..

తమిళనాడులోని శివకాశీ సమీపంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. కూలీలు కొన్ని మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై […]

తమిళనాడులో భారీ పేలుడు.. నలుగురు మృతి.. గాల్లోకి ఎగిరిపడ్డ కూలీలు..

Updated on: Feb 19, 2020 | 11:18 PM

తమిళనాడులోని శివకాశీ సమీపంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. కూలీలు కొన్ని మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు సంఘటన జరిగిన వెంటనే.. ఫ్యాక్టరీ యజమాని పరారీలో ఉన్నాడు. సత్తూరు నగర్‌ పోలీసులు అతని గురించి గాలిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us