మంచిర్యాల జిల్లాలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఎర్టిగ కారు.. కొడుకు అక్కడికక్కడే మృతి, భార్యభర్తలిద్దరికీ తీవ్ర గాయాలు

Ertiga car crashes into house in Manchiryala district : తెలంగాణ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం సుభాష్ నగర్ బస్తీలో అర్థరాత్రి దారుణం చోటుచేసుకుంది. స్థానిక కంభాల లింగయ్య కుటుంబ సభ్యులు

మంచిర్యాల జిల్లాలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఎర్టిగ కారు.. కొడుకు అక్కడికక్కడే మృతి, భార్యభర్తలిద్దరికీ తీవ్ర గాయాలు
Car Crash

Updated on: Apr 04, 2021 | 10:32 AM

Ertiga car crashes into house in Manchiryala district : తెలంగాణ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం సుభాష్ నగర్ బస్తీలో అర్థరాత్రి దారుణం చోటుచేసుకుంది. స్థానిక కంభాల లింగయ్య కుటుంబ సభ్యులు ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఇంటి పైకి దూసుకొచ్చింది ఒక మారుతి ఎర్టిగ కారు. ఒక్కసారిగా కారు దూసుకొచ్చి మీద పడ్డంతో ఇంట్లో ఉన్న కొడుకు మధు (18) అక్కడికక్కడే మృతి చెందగా, భార్యభర్తలిద్దరికి తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాదానికి కారణమైన వ్యక్తి కారుతో సహా పరారయ్యాడు. కారు డ్రైవర్ ను రాకేష్ అనే వ్యక్తి గా గుర్తించిన పోలీసులు. డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు.

Read also : Girl kidnap : మచిలీపట్నంలో మైనర్ బాలిక కిడ్నాప్, ఇళ్లు అద్దెకు దొరుకుతాయా.. అంటూ మత్తు మందు చల్లిన ఆగంతకుడు