అత్తింటి వేధింపులు తాళలేక మహిళ మృతి..!

|

Sep 12, 2020 | 9:19 AM

కృష్ణాజిల్లా పామర్రులో విషాదం చోటుచేసుకుంది. మౌనిక అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. పమిడిముక్కల మండలం వీరంకిలాకులో ఈ ఘటన జరిగింది.

అత్తింటి వేధింపులు తాళలేక మహిళ మృతి..!
Follow us on

Crime In Krishna District: కృష్ణాజిల్లా పామర్రులో విషాదం చోటుచేసుకుంది. మౌనిక అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. పమిడిముక్కల మండలం వీరంకిలాకులో ఈ ఘటన జరిగింది. అత్తింటివారే తమ కుమార్తెను హత్య చేసి ఉంటారని మౌనిక తరఫు బంధువులు ఆరోపించారు.

మౌనిక భర్త అనిల్‌…బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అదనపు కట్నం కోసం మౌనికను అత్తమామలు, ఆడపడుచులు చిత్రహింసలు పెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి ‌. మౌనిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో భర్త అనిల్‌, ఆడపడుచు, అత్తమామలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: 

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..

”అంతర్వేది ఘటనలో చంద్రబాబు ప్రమేయం ఉంది”

ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్.. ఆ ముగ్గురిలో ఒకరు ఔట్..!