Corona Pandemic: బీహార్ లో దారుణం..కరోనా వచ్చిందని భార్యను చంపేసి ఆత్మహత్య చేసుకున్న భర్త!

|

Apr 26, 2021 | 11:20 PM

కరోనా మానవత్వాన్ని మంట కలిపెస్తోంది. బంధాలను తెంచేస్తోంది. కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. తాజాగా బీహార్ లో ఘోరం చోటు చేసుకుంది.

Corona Pandemic: బీహార్ లో దారుణం..కరోనా వచ్చిందని భార్యను చంపేసి ఆత్మహత్య చేసుకున్న భర్త!
Crime
Follow us on

Corona Pandemic: కరోనా మానవత్వాన్ని మంట కలిపెస్తోంది. బంధాలను తెంచేస్తోంది. కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. తాజాగా బీహార్ లో ఘోరం చోటు చేసుకుంది. తన భార్యకు కరోనా అని తేలడంతో.. ఓ రైల్వే ఉద్యోగి ఆమె తల నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా బిల్డింగ్‌ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషాదకరమైన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ లోని పత్రకార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మున్నాచక్‌ ప్రాంతంలో అతుల్‌ లాల్‌ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. ఇతను రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం లాల్‌ భార్యకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఆగ్రహించిన అతుల్ తన భార్యను దారుణంగా కత్తితో తల నరికి చంపేశాడు. ఆ తరువాత తానూ అదే బిల్డింగ్ పైకి ఎక్కి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలేసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఇంతకు ముందు ఢిల్లీ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఆ ఘటనలో కరోనా కారణంగా తన భార్యను క్రూరంగా 25 కత్తి పాటలకు గురిచేసి చంపేశాడు ఓ భర్త.

ప్రేమించుకున్నారు.. పెద్దలు ఒప్పుకోలేదని..

కలిసి జీవించడానికి పెద్దలు ఒప్పుకోలేదనే, ఆవేదనతో ప్రేమ జంట బలవన్మరణం పొందారు. కర్నాటక లోని హావేరి తాలూకా నాగనూరు గ్రామానికి చెందిన విద్యాశ్రీ గాలి (22), ఇర్షాద్‌ కుడచి (23) ఆత్మహత్య చేసుకున్నారు. మూడేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. విద్యాశ్రీ బీకాం చదువుతుండగా, ఇర్షాద్‌ కుడచి డిప్లొమా పూర్తిచేశాడు. ఇటీవల విద్యాశ్రీకి తల్లిదండ్రులు ఓ యువకునితో నిశ్చితార్థం చేశారు. ప్రేమకు దూరం కావడం ఎంతమాత్రం ఇష్టలేని విద్యాశ్రీ, ఇర్షాద్‌ కలిసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.