హైదరాబాద్‌‌‌లో పబ్ పై ఆకస్మికంగా దాడి.. 28 మందిని అదుపులోకి తీసుకున్నా పోలీసులు..

|

Feb 07, 2021 | 7:22 PM

నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పబ్ పై పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. పంజాగుట్టలోని లెస్బిన్ పబ్ లో అసంగిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న..

హైదరాబాద్‌‌‌లో పబ్ పై ఆకస్మికంగా దాడి.. 28 మందిని అదుపులోకి తీసుకున్నా పోలీసులు..
Follow us on

Hyderabad : నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పబ్ పై పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. పంజాగుట్టలోని లెస్బిన్ పబ్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పంజాగుట్ట పోలీసులు టాక్స్ ఫోర్స్ పోలీసులు కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో మహిళలతో అసభ్యంగా డ్యాన్సులు చేయిస్తుండడంతో పలువురు సిబ్బందితో పాటు, మొత్తం 28 మందిని అదుపులోకి తీసుకున్నారు.

పబ్ నిర్వాహకులు పరారీలో ఉన్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8మంది మహిళలను రెస్క్యూ చేసి హోంకు తరలించారు పోలీసులు. గతంలో కూడా లెస్బిన్ పబ్‌లో ఎన్నోసార్లు అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని, బార్‌ అనుమతులు రద్దుచేయాలని ఎక్సైజ్‌ అధికారులకు, పబ్‌ అనుమతిని రద్దు చేయాలని కలెక్టర్‌కు లేఖ రాయనున్నట్లు పంజగుట్ట ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

హైదరాబాద్‌‌‌‌లో దారుణం.. ఆర్టీసీ బస్సు ఢీకొని మూడేళ్ళ బాలుడు మృతి..