AP Crime News: గుంటూరు జిల్లాలో దారుణం, అన్నదమ్ముల పిల్లల మధ్య ఘర్షణ.. ఇద్ద‌రు మృతి

గుంటూరు జిల్లా దారుణం జ‌రిగింది. వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో అన్నదమ్ముల పిల్లల మధ్య ఘర్షణ జరగ్గా ఇద్దరు మరణించారు. వివ‌రాల్లోకి వెళ్తే..

AP Crime News: గుంటూరు జిల్లాలో దారుణం, అన్నదమ్ముల పిల్లల మధ్య ఘర్షణ.. ఇద్ద‌రు మృతి
Death

Updated on: May 13, 2021 | 8:43 PM

గుంటూరు జిల్లా దారుణం జ‌రిగింది. వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో అన్నదమ్ముల పిల్లల మధ్య ఘర్షణ జరగ్గా ఇద్దరు మరణించారు. వివ‌రాల్లోకి వెళ్తే.. కుంచాల రామకోటయ్య, కుంచాల నాగేశ్వరరావు ఇద్దరు సోదరులు. ఇరు కుటుంబాల మ‌ధ్య గ‌త‌ కొన్నేళ్లుగా గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం ఈ ఇద్దరు అన్నదమ్ముల పిల్లల మధ్య ఘర్షణ జరిగింది. రామకోటయ్య కుమారులు నాగేశ్వరరావు కుమారులపై ఆయుధాలతో దాడి చేశారు. దాడిలో నాగేశ్వరరావు కుమారులు కుంచాల వెంకట్రావు, రాము మృతి చెందారు. పాతకక్షలు నేపథ్యంలో దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను గుంటూరు జిజిహెచ్ కి తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ మాజీ స‌ర్పంచ్ హ‌త్య

శ్రీకాకుళం గ్రామీణ మండలం కనుగులవానిపేట గ్రామంలో టీడీపీకు చెందిన మాజీ సర్పంచ్ కనుగుల కృష్ణారావు దారుణ హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన సవరరాజు అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణారావు ఈ ఉదయం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లారు. దగ్గరలో ఉన్న చెట్ల వద్ద కూర్చుని ఉండగా వెనుక నుంచి వచ్చి తలపై బలంగా దాడి చేసి నిందితుడు పరారయ్యాడు. తీవ్ర రక్త స్రావంతో కృష్ణారావు స్పాట్ లోనే చ‌నిపోయాడు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్సై, సీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: వెంట‌నే మీ ఫ్లిప్‌కార్ట్ పాస్‌వ‌ర్డ్‌ను మార్చేయండి.. హెచ్చ‌రిస్తోన్న సైబ‌ర్ నిపుణులు..

కలవర పెడుతున్న అధ్యయనాలు.. దూకుడు పెంచిన దేశాలు.. పిల్లలకూ కరోనా వ్యాక్సీన్..

Loading...
Unable to load recommendations.
Follow Us