పెనుగొండ వద్ద బస్సు ప్రమాదం..14 అడుగుల లోతులో పడిపోయిన బస్సు

|

Sep 10, 2020 | 7:11 AM

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ రాయవరం మండలం పెనుగొండ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. వరహానది ఒడ్డున బ్రిడ్జిపై నుంచి ఓ ప్రైవేట్ బస్సు 14 అడుగుల లోతులో పడిపోయింది.

పెనుగొండ వద్ద బస్సు ప్రమాదం..14 అడుగుల లోతులో పడిపోయిన బస్సు
Follow us on

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ రాయవరం మండలం పెనుగొండ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. వరహానది ఒడ్డున బ్రిడ్జిపై నుంచి ఓ ప్రైవేట్ బస్సు 14 అడుగుల లోతులో పడిపోయింది. చెన్నై నుంచి విశాఖ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపుతప్పడంతో పెనుగొండ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ఐదుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. బస్సు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలిపిన పోలీసులు.. అందులోని ప్రయాణికుల గురించి గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.