
బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెండు రోజుల పాటు రెచ్చిపోయారు. సికింద్రాబాద్లో దొంగతనానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను స్థానికులు చితకబాదారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంసాలి బజార్, రామాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం రోజున మొదట ఇద్దరు దొంగలు ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడారు. ఇంట్లో ఉన్న విలువైన ఇత్తడి సామాగ్రిని చోరీ చేశారు. అప్పటి నుండి దొంగల వార్త ఆ నోట ఈ నోటా తెలిసి అందరూ అలెర్ట్ గా ఉన్నారు. మంగళవారం రాత్రి మళ్లీ దొంగతనానికి ప్రయత్నించిన దుండగులు ఈసారి తప్పించుకోలేకపోయారు.
ఇంతకుముందే అనుమానం వచ్చిన స్థానికులు రాత్రంతా కాపు కాసి దొంగలను ఎలాగైనా పట్టుకోవాలని ప్లాన్ చేశారు. అర్థరాత్రి సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నిస్తుండగా ప్రజలు వారిపై దాడి చేసి పట్టుకున్నారు. కోపంతో ఊగిపోయిన జనాలు వారిని చితకబాదడమే కాకుండా స్తంభానికి కట్టి బోయిన్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు దొంగలించిన మూడు ఇత్తడి తాంబాలాలు, సుమారు 12 కిలోల బరువు ఉన్న సామాగ్రిని ఫతేనగర్లోని ఓ స్క్రాప్ షాపులో విక్రయించినట్లు విచారణలో తేలింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, దొంగలను తమ అదుపులోకి తీసుకున్నారు. దొంగలించిన సామాగ్రిని రికవరీ చేసినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఇద్దరినీ విచారణ కోసం పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి