Pregnant Woman Suicide: పెళ్లై మూడేళ్లకే గ్రామ వాలంటీర్ ఆత్మహత్య.. చేతిలో ఓ బిడ్డ, కడపుల మరో బిడ్డతో బావిలో దూకి మృతి

|

Jun 26, 2021 | 10:32 AM

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ నిండు గర్భిణి.. రెండేళ్ల బిడ్డ తన బిడ్డతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

Pregnant Woman Suicide: పెళ్లై మూడేళ్లకే గ్రామ వాలంటీర్ ఆత్మహత్య.. చేతిలో ఓ బిడ్డ, కడపుల మరో బిడ్డతో బావిలో దూకి మృతి
Pregnant Woman Commits Suicide With Two Years Baby Girl
Follow us on

Pregnant Woman Suicide with Two Years Baby: శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ నిండు గర్భిణి.. రెండేళ్ల బిడ్డ తన బిడ్డతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన మురపాక గ్రామ సమీపంలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్న ఆ యువతికి తండ్రి, మేనమామలు ఏ లోటూ లేకుండా గారాభంగా పెంచి పెద్ద చేశారు. ఓ వ్యక్తికిచ్చి ఘనంగా పెళ్లి చేశారు. ఏడాది తిరగ్గానే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లిగా మారింది. ఇక, ఆమె జీవితమంతా ఆనందమే అనుకుని బంధువులు మురిసిపోయారు. అయితే, ఊహించని రీతిలో ఆమె కాపురంలో కలతలు మొదలయ్యాయి. నిత్యం నరకం అనుభవిస్తూ బాధనంతా పంటి బిగువున భరిస్తూ వచ్చింది. చివరికి విసిగిపోయి ఆ నరకం కంటే మరణమే శరణ్యమనుకుంది. తాను నిండు గర్భిణి అని కూడా ఆలోచించలేదు.. రెండేళ్ల బిడ్డ అనాథ కాకూడదనుకుంది. తన బిడ్డతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన బోనెల రాజేశ్వరి(28)కి అదే గ్రామానికి చెందిన కోటేశ్వరరావుతో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి రెండేళ్ల పాప భువనేశ్వరి ఉంది. రాజేశ్వరి స్థానికంగా గ్రామ వాలంటీరుగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఏడునెలల గర్భిణి. భార్యాభర్తల గొడవల కారణంగా ఈనెల 23న పాపను తీసుకొని ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. అప్పటినుంచి కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం చిన్నమురపాక సమీపంలోని నేలబావిలో తల్లీ బిడ్డల మృతదేహాలు తేలడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ విషయం సమీప గ్రామాలకు తెలియడంతో కేశవరాయుపాలెం నుంచి కొందరు ఘటనా స్థలానికి చేరుకొని అవి రాజేశ్వరి, భువనేశ్వరి మృతదేహాలుగా గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కి తరలించారు. వీరిద్దరూ ఇంటి నుంచి బయలుదేరినరోజే చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేశ్వరి తమ్ముడు గన్నియ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు లావేరు పోలీసులు తెలిపారు.

ఇదిలావుంటే, అత్తింటి వేధింపులు తాళలేకే రాజేశ్వరి బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం తీసుకురావాలని అత్తమామలు వేధించేవారని, భర్త కోటేశ్వరరావు నిత్యం మద్యం తాగి వచ్చి కొట్టేవాడని రాజేశ్వరి తమ్ముడు గన్నియ్య, తండ్రి సూర్యనారాయణ చెబుతున్నారు. ఇంట్లో నరకం చూపిస్తున్నారంటూ రాజేశ్వరి తరుచూ తమకు చెప్పుకుని బాధపడేదని వాపోయారు. తన సోదరి వెళ్లిపోయినప్పటి నుంచి లావేరు పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పట్టించుకోలేదని గన్నియ్య ఆరోపిస్తున్నారు. రాజేశ్వరికి సీమంతం చేసి తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు పుట్టింటివారు ఈనెల 30న ముహూర్తం నిర్ణయించారు. ఇంతలోనే దారుణం జరగడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామంలో అందరితో సరదాగా ఉండే రాజేశ్వరి ఆత్మహత్య చేసుకోవడంతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Read Also…..  గర్భాశయం లేదు..అయినా ఆరోగ్య వంతమైన బిడ్డకు జన్మనిచ్చింది..!అమెరికాలో అరుదైన శస్త్ర చికిత్స:Woman born without Uterus.