ACB Rides: మాజీ మంత్రి ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు.. కళ్లు చెదిరేలా డబ్బు, బంగారం సీజ్..

|

Sep 17, 2021 | 8:36 AM

Tamil Nadu: అన్నాడీఎంకే ముఖ్యనేత, మాజీ మంత్రి కేసీ వీరమణి ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో విదేశీ కరెన్సీ భారీగా పట్టుబడింది.

ACB Rides: మాజీ మంత్రి ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు.. కళ్లు చెదిరేలా డబ్బు, బంగారం సీజ్..
Chennai
Follow us on

Tamil Nadu: అన్నాడీఎంకే ముఖ్యనేత, మాజీ మంత్రి కేసీ వీరమణి ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో విదేశీ కరెన్సీ భారీగా పట్టుబడింది. ఈ సోదాల్లో మొత్తం 9 విలాసంతమైన కార్టు, 5 కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి మంత్రిగా పని చేసిన కేసీ వీరమణి.. భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మాజీ మంత్రి ఇల్లు, ఆఫీస్, బంధువుల ఇళ్లు సహా మొత్తం 35 ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో కోట్లలో విలువైన ఆస్తి పత్రాలను అధికారులు గుర్తించారు. 5 కేజీల బంగారం, 47 గ్రాముల డైమండ్స్, 7.2 కేజీల వెండి, రోల్స్ రాయల్స్ సహా 9 విలాసవంతమైన కార్లు, 34 లక్షల నగదు, 1.8 లక్షల విదేశీ కరెన్సీని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Also read:

NTR: పక్కా ప్లానింగ్‌తో పాన్ ఇండియా మూవీస్‌ను లైన్‌లో పెడుతున్న యంగ్ టైగర్… తారక్ 30 తర్వాత ఎవరితోనో తెలుసా..

Microsoft: సెకనుకు 579 పాస్‌వర్డ్‌లపై హ్యాకర్ల దాడి.. కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్న మైక్రోసాఫ్ట్‌..!

Siddeshwara temple: హన్మకొండలోని సిద్దేశ్వరాలయంలో అద్భుతం.. సూర్యకిరణాలు తాకిన అనంతరం