Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని 9 మంది దుర్మరణం.. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా..

|

Sep 20, 2021 | 7:56 AM

9 Killed in Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని 9 మంది దుర్మరణం.. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా..
Road Accident
Follow us on

9 Killed in Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫరాస్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్కార్పియో, ఆటో ఢీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన బస్తర్‌లోని కొండగావ్ తహసీల్‌లోని బోర్గావ్ సమీపంలో చోటుచేసుకుంది. ఆదివారం ఒకే కుటుంబానికి చెందిన 16 మంది సభ్యులు గోద్మా గ్రామంలో జరిగిన ఓ బంధువు అంత్యక్రియలకు వెళ్లారు.

అనంతరం తమ సొంత గ్రామమైన పాండేయత్‌గావ్‌కు తిరిగి ఆటోలో వెళుతున్నారు. ఈ క్రమంలో బోర్గావ్ పీటీఎస్ క్యాంప్ సమీపంలో ఎదురుగా వస్తున్న స్కార్పియో ఈ ఆటోను వేగంతో ఢీకొట్టింది. దీంతో ఆటోలోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందినట్లు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. మృతులలో 10 నెలల శిశువు కూడా ఉన్నట్లు తెలిపారు. స్కార్పియో జగదల్‌పూర్‌ వెళుతున్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి చికిత్స జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం స్కార్పియో డ్రైవర్‌ పరారైనట్లు ఫరాస్‌గావ్‌ పోలీసులు తెలిపారు.

Also Read:

Drug Racket: ఆఫ్ఘన్‌ టు బెజవాడ.. భారీ డ్రగ్ రాకెట్ గుట్టురట్టు.. రూ.9 వేల కోట్ల హెరాయిన్ స్వాధీనం..

Pensioners Alert: పెన్షన్‌ దారులకు గమనిక..! అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలలో మార్పు..