AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 మంది స్కూల్ విద్యార్థులకు కరోనా..ఆందోళనలో తల్లిదండ్రులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్యలో ఇంకా భారీగానే నమోదవుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అనేక మంది వైరస్ బారినపడుతున్నారు. విజయనగరంలో ఒకే క్లాస్ విద్యార్థుల్లో 20 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది.

20 మంది స్కూల్ విద్యార్థులకు కరోనా..ఆందోళనలో తల్లిదండ్రులు
Jyothi Gadda
|

Updated on: Oct 04, 2020 | 5:36 PM

Share

ఏపీలో కరోనా కేసుల సంఖ్యలో ఇంకా భారీగానే నమోదవుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అనేక మంది వైరస్ బారినపడుతున్నారు. విజయనగరంలో ఒకే క్లాస్ విద్యార్థుల్లో 20 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

విజయనగరం జిల్లా గంట్యాడ జడ్పీ పాఠశాలలో ఇరవై మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గత నెల 30న గంట్యాడ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో 20 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధారించారు వైద్యులు. అయితే ఉపాధ్యాయుల్లో ఎవరికీ కరోనా సోకలేదని చెప్పారు. విద్యార్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలో నిర్వహిస్తున్న తరగతులకు విద్యార్థులు హాజరుకావడం వల్లే కరోనా వ్యాప్తించిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. కరోనా తగ్గే వరకు పాఠశాలలు తెరవొద్దని గతంలో అనేక సార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం స్పందించారు. ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ.. ఈ అంశంపై విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. కరోనా సోకిన 20 మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా పరిషత్‌ హైస్కూల్లో మొత్తం 108 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 20 మందికి కరోనా సోకినట్లు తెలిపారు. అయితే కరోనా సోకిన విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కరోనా పరీక్షలు చేయాలని డీఎమ్‌హెచ్‌వోను ఆదేశించినట్లు చెప్పారు. ఒకవేళ కరోనా సోకిన విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు లేకపోతే హోం క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అయితే ఆన్ లైన్‌లోనే క్లాసులు నిర్వహిస్తున్నామని స్కూల్ హెడ్మాస్టర్ అంటున్నారు. సందేహాలు నివృత్తి చేసుకునేందుకు స్కూల్ కి వచ్చారని, అలా వచ్చిన విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని అంటున్నారు. స్కూల్ కి వచ్చిన తరువాత కరోనా సోకిందా? లేక లక్షణాలు కనిపించకుండా ఉన్న విద్యార్థులు కరోనాతో స్కూల్ కి వచ్చారా అనే అంశం పై అధికారులు ఆరా తీస్తున్నారు.

Follow Us
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?