కోహ్లీ కోట్లు కొల్లగొట్టాడు

|

Jun 06, 2020 | 12:37 PM

కరోనా కట్టడిలో దేశంమొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఉపాధి లేకుండా జనం ఇంటికే పరిమితమయ్యారు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం కోట్లు కూడబెట్టుకున్నాడు. క్రికెట్‌ మ్యాచ్‌లు లేకపోయినా.. కొత్తగా ఎండార్స్‌మెంట్‌ కుదుర్చుకోకపోయినా ఇదెలా సాధ్యమైందని భావిస్తున్నారా..

కోహ్లీ కోట్లు కొల్లగొట్టాడు
Follow us on

కరోనా కట్టడిలో దేశంమొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఉపాధి లేకుండా జనం ఇంటికే పరిమితమయ్యారు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం కోట్లు కూడబెట్టుకున్నాడు. క్రికెట్‌ మ్యాచ్‌లు లేకపోయినా.. కొత్తగా ఎండార్స్‌మెంట్‌ కుదుర్చుకోకపోయినా ఇదెలా సాధ్యమైందని భావిస్తున్నారా.. అంతా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ మాయ. సామాజిక మాధ్యమాల ఆర్జనలో విరాట్‌ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 62.1 మిలియన్లు ఫాలోయర్లు కలిగిన కోహ్లీ మార్చి 12 నుంచి మే 14 వరకు అక్షరాలా మూడు కోట్ల 62 లక్షలు మూటగట్టుకున్నాడు. ఈ సమయంలో అతడు కేవలం మూడు స్పాన్సర్డ్‌ పోస్టులను మాత్రమే తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. దీంతో కోహ్లీ పోస్ట్ చేసి ప్రతి ఫోటోకు రూ. 1.20 కోట్లు తన ఖాతాలో వచ్చిపడ్డాయి.