భారత్‌కు ధన్యవాదాలు చెప్పిన అమెరికా

|

Jul 07, 2020 | 11:18 PM

టిబెట్ బౌద్ధ గౌరువు దలైలామ 1959 నుంచి ఇప్పటి వరకు భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు.  టిబెట్ పై చైనా చేస్తున్న దాష్టీకంను భరించలేక దలైలామా భారత్ వచ్చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల నుంచే ప్రవాస టిబెట్ ప్రభుత్వం నడుస్తోంది. 1.60 లక్షలకు పైగా టిబెటన్లు భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. కాగా, దలైలామా జన్మదినం (జూలై 6) సందర్భంగా అమెరికా ఓ ప్రకటన వెలువరించింది. దలైలామాకు 1959 నుంచి ఆశ్రయం ఇస్తున్నందుకు భారత్ కు ధన్యవాదాలు […]

భారత్‌కు ధన్యవాదాలు చెప్పిన అమెరికా
Follow us on

టిబెట్ బౌద్ధ గౌరువు దలైలామ 1959 నుంచి ఇప్పటి వరకు భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు.  టిబెట్ పై చైనా చేస్తున్న దాష్టీకంను భరించలేక దలైలామా భారత్ వచ్చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల నుంచే ప్రవాస టిబెట్ ప్రభుత్వం నడుస్తోంది. 1.60 లక్షలకు పైగా టిబెటన్లు భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. కాగా, దలైలామా జన్మదినం (జూలై 6) సందర్భంగా అమెరికా ఓ ప్రకటన వెలువరించింది.

దలైలామాకు 1959 నుంచి ఆశ్రయం ఇస్తున్నందుకు భారత్ కు ధన్యవాదాలు తెలిపింది అమెరికా. టిబెటన్ల సంఘర్షణకు, వారి వారసత్వానికి ప్రతీకగా నిలిచారు. అలాంటి మహనీయుడికి, టిబెటన్లకు ఆశ్రయం కల్పిస్తున్న భారత్ కు కృతజ్ఞతలు” అంటూ అమెరికా విదేశాంగ శాఖ సెంట్రల్ ఏషియన్ అఫైర్స్ బ్యూరో ట్వీట్ చేసింది.